Virat Craze: క్రికెట్ అంటేనే ఓ పిచ్చి. అందులో విరాట్ కోహ్లిపై ఉండే అభిమానం మరీ ఎక్కువ . ఆ శృతి ఎంతగా పెరిగిందంటే..ఓ మహిళాభిమాని ప్రదర్శించిన బ్యానర్ చూస్తే మీకే అర్ధమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోని ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకడు విరాట్ కోహ్లి. విరాట్ కోహ్లి క్రేజ్‌కు పరిమితుల్లేవు. ఐపీఎల్ 2022లో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఓ మహిళా అభిమాని ప్రదర్శించిన సంచలనమైన బ్యానర్ మీ మతి పోగొడుతుంది. అంతగా మతి పోగొట్టే అంశం లేదా కంటెంట్ ఆ బ్యానర్‌లో ఏముందసలు. 


విరాట్ కోహ్లి 71వ సెంచరీ పూర్తయ్యేవరకూ నేను డేటింగ్ చేయను...ఇదీ ఆ మహిళ ప్రదర్శించిన బ్యానర్‌లో ఉన్న అంశం. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా.  33 ఏళ్ల విరాట్ 71వ సెంచరీ కోసం ఎంతగా నిరీక్షణ ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి విరాట్ కోహ్లీ సెంచరీ చేసి చాలా కాలమైంది. 2021లో ఆర్సీబీ కెప్టెన్‌గా దిగిపోయిన విరాట్..చివరిగా బంగ్లాదేశ్‌పై 2019లో సెంచరీ చేశాడు. అప్పట్నించి అభిమానులు విరాట్ కోహ్లీ సెంచరీ కోసం చాలా నిరీక్షిస్తున్నారు.



శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతంగా రాణించాడు. 36 బంతుల్లో 48 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకు కేవలం రెండు పరుగుల దూరంలో అవుటయ్యాడు. శనివారం విరాట్ గ్రౌండ్లో మెరుపులు మెరిపిస్తున్నప్పుడు ఓ మహిళా అభిమాని ఈ బ్యానర్ ప్రదర్శించింది. అంతే అన్ని కెమేరాలు ఆ బ్యానర్‌పై ఫోకస్ పెట్టాయి. అభిమానం మరీ పరిధులు దాటడమంటే ఇదే..


Also read: RCB vs MI: ముంబైకు మరో ఓటమి, 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook