టీమిండియా వరల్డ్ కప్ సభ్యుడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్  కేదార్‌ జాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో ఓ బౌండరీని ఆపే ప్రయత్నంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వరల్డ్ లో ఆడేందకు ఛాన్స్ కోల్పోయి ప్రమాదంలో పడ్డారు. వరల్డ్ కప్ నాటికి ఫిట్ నెస్ సాధిస్తే సరి లేకుంటే అతని స్థానంలో మరోకరిని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అదే జరిగితే స్టాండ్‌ బై సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు అవకాశం దొరుకుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంబటియే ఎందుకంటే ...?


ప్రస్తుతం వైద్యులు ఎక్స్‌రే తీసి జాదవ్ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గాయం మరీ పెద్దది కాదని...సరైన విశ్రాంతి తీసుకుంటే ప్రపంచ కప్‌ ముందు కోలుకునే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు. వరల్డ్ కప్ నాటికి జాదవ్ కోలుకుంటే సరి.. ఒకవేళ కేదార్‌ ఆడే పరిస్థితి లేకపోతే స్టాండ్‌ బై సభ్యులుగా ఉన్న అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌ల్లో ఒకరికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వరల్డ్ జట్టులో వికెట్ కీపర్లుగా ధోనీ, దినేష్ కార్తీలు ఉన్నారు. దీంతో మూడో వికెట్ కీపర్ ను తీసుకునే అవకాశం లేదు. దీంతో పంత్ కు తీసుకునే అవకాశాలు తక్కువ. పైగా జాదన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ కావడంతో అతని స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్స్ అయిన అంబటి రాయుడిని తీసుకునే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు