Team India Test Captain: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో 2-1 తేడాతో టీమ్ ఇండియా పరాజయం పాలైన తర్వాత.. జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం అధికారికంగా (Virat Kohli Resignation from Test Captaincy ) ప్రకటించాడు కోహ్లీ. దీనితో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ (Virat Kohli Captaincy) నిష్క్రమించినట్లయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కెప్టెన్​పై కసరత్తు..


అయితే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తక్షణమే తప్పుకున్న నేపథ్యంలో.. బీసీసీఐ ముందు కొత్త సవాలు వచ్చి (BCCI on New test Test Captain) పడినట్లయింది. ఎందుకంటే వచ్చే శ్రీలంకకు టెస్టు సిరీస్​కు ఆథిత్యం ఇవ్వనుంది ఇండియా. ఫిబ్రవరి 25 నుంచి షెడ్యూల్​ ప్రారంభం  కానుంది. ఈ లోపే టీమ్​ ఇండియా టెస్టు కెప్టెన్​ను నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది.


బీసీసీఐ ముందున్న ముఖ్యమైన పేర్లు..


రోహీత్ శర్మ..


వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత.. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకీ రోహిత్​ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముందనే అభిప్రాయాలు (BCCI searching for captain) వ్యక్తముతున్నాయి. ఇప్పటికే టెస్టు టీమ్​ వైస్​ కెప్టెన్​గా రోహిత్ శర్మ కొనసాగుతున్న విషయం (Rohit sharma test captain) తెలిసిందే.


కేఎల్ రాహుల్​..


ఒక వేళ రోహిత్ శర్మను టెస్టు టీమ్ కెప్టెన్​గా ఎంపిక చేయకుంటే.. ఆ తర్వాత ఆప్షన్ కేఎల్ రాహుల్ అని అంచనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కోహ్లీ, రోహిత్ శర్మలు మ్యాచ్​లకు దూరమవగా..  కేఎల్​ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు (KL Rahul test captain) నిర్వహించాడు. దీనితో అతడికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


రిషబ్​ పంత్​..


రిషబ్​ పంత్​కు కూడా టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. యువ ఆటగాడైన పంత్​కు బాధ్యతలు ఇస్తే ఎక్కువ కాలం కెప్టెన్సీగా కొనసాగే అవకాశముంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా రిషబ్​ పంత్​ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం (Rishabh pant in test) తెలిసిందే.


జస్ప్రిత్​ బుమ్రా..


బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రాకు కూడా టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్​లో కేఎల్ రాహుల్​ కెప్టెన్​గా బాధ్యతలు నిర్వహించగా.. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్​గా (Bumrah test captain) వ్యవహరించాడు.


అయితే ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Also read: Virat Kohli Test captaincy: కోహ్లీ షాకింగ్ నిర్ణయం- టెస్టు కెప్టెన్సీకి గుడ్​బై!


Also read: IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమితో.. టీమ్ ఇండియాపై సునీల్ గావస్కర్ అసంతృప్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook