IPL 2022: ఐపీఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీల మధ్య తొలి మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో టీమ్ యాజమాన్యం నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ మరి కాస్సేపట్లో గుజరాత్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లూ ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా వచ్చి చేరినవే. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా సారధ్యం వహిస్తుండగా..లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. మరి కాస్సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుందనగా..టీమ్ యాజమాన్యం ముఖ్యమైన అప్‌డేట్ విడుదల చేసింది. 


గుజరాత్ టైటాన్స్ జట్టు వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేసింది. జట్టు వైస్ కెప్టెన్‌గా ఎస్ఆర్‌హెచ్ మాజీ ఆటగాడు రషీద్ ఖాన్‌ను ప్రకటించింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు..ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ సారధ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు సిద్ధమౌతోంది. ఐపీఎల్ వేలం కంటే ముందే..రషీద్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు 15 వేలకు కొనుగోలు చేసింది. 


Also read: Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook