అమెరికాలోని సుప్రసిద్ధ 'మేజర్ లీగ్ బేస్‌బాల్' లో సియాటెల్ మారినర్స్ జట్టు తరఫున టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 'ఫస్ట్ పిచ్' అవకాశాన్ని కొట్టేశాడు. ఈ మేరకు సియాటెల్ జట్టు రోహిత్ శర్మను ఆహ్వానించింది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారత క్రికెటర్ రోహిత్ కావడం విశేషం.


సాఫెకొ ఫీల్డ్‌లోని మారినర్స్‌ హోమ్‌ గ్రౌండ్‌లో ప్రారంభోత్సవ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ ‘ఫస్ట్‌ పిచ్‌’తో బేస్‌బాల్‌ మ్యాచ్‌ మొదలవుతుంది. మ్యాచ్ కు ముందు బేస్‌బాల్‌ను విసరడాన్నే 'ఫస్ట్ పిచ్' అంటారు. ఇవాల్టి నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది.