అడిలైడ్‌ : ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్ మరో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 120 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌నే వరించిది. తొలి ఇన్నింగ్స్‌లో 442 పరుగులు చేసిన ఆసీస్ ..రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 138 పరుగులకే కుప్పకూలింది. 354 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ టీం 227  పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు విజయం దక్కింది. మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ సునాయాసంగా విజయం సాధించగలిగింది. కాగా ఈ విజయంతో స్మిత్ సేన ఈ సిరీస్‌‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.