కొలంబో, ప్రేమదాస స్టేడియం: ముక్కోణ‌పు టీ – 20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన భార‌త్, శ్రీ‌లంక తొలి టీ–20లో శ్రీ‌లంక జ‌ట్టు తొలి విజయాన్ని నమోదుచేసింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుశాల్ పెరీరా 66 పరుగులు (37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి లంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లంక ఓపెనర్లు దనుష్క గుణతిలక (19), కుశాల్ మెండిస్ (11), దినేశ్ చండీమల్ (14), ఉపుల్ తరంగ (17), దాసన్ శంక (15), థిసార పెరీరా (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయాడు.మరో ఓపెనర్ శిఖర్ ధవన్ మాత్రం నిలకడగా ఆడుతూ శ్రీలంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని (  90 పరుగులు (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. సురేశ్ రైనా (1), మనీష్ పాండే (37), రిషబ్ పంత్ (23), దినేశ్ కార్తీక్ (13) పరుగులు చేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీర రెండు వికెట్లు పడగొట్టాడు. కుశాల్ పెరీరాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.