టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మళ్లీ సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఇటీవలే శ్రీరెడ్డి టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖుల మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది. క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్ అని పిలువబడే ఓ క్రికెటర్‌కి, టాలీవుడ్ నటికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు గుప్పించింది. ప్రపంచ క్రికెట్‌లోనే.. దేవుడిగా కొలిచే ఓ క్రికెటర్‌కి, టాలీవుడ్‌ నటికి లింక్ పెట్టింది. క్రికెట్ రంగానికి చెందిన మరో వ్యక్తి వీరిద్దరికి మధ్య మీడియేటర్‌లా వ్యవహరించారంటూ పోస్ట్‌ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీరెడ్డి తన అఫీషియల్ ఫేస్‌బుక్‌లో ఇద్దరి వ్యక్తుల పేర్లను ప్రస్తావించింది. అందులో ఆ క్రికెటర్ పేరును చెప్పగా.. అతను రొమాన్స్ చేసిన నటి పేరును స్పష్టంగా చెప్పలేదు. కానీ హింట్ ఇచ్చింది. 'సచిన్ టెండూల్కర్ అనే రొమాంటిక్ వ్యక్తి, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చార్మింగ్ అమ్మాయి (హీరోయిన్ ఛార్మి)తో రొమాన్స్ చేశాడు. వీరిద్దరికి మధ్యవర్తిగా చాముండేశ్వర్ స్వామి వ్యవహరించారు. గొప్ప వ్యక్తులు బాగా ఆడుతారు.. అంటే నా ఉద్దేశంలో బాగా రొమాన్స్ చేస్తారు అని అర్థం..' అంటూ ఆమె ఈ పోస్ట్‌లో ఆరోపించింది.


శ్రీరెడ్డి గతంలో ఫేస్‌బుక్‌ వేదికగా టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులపై, పలువురు నిర్మాతలపై ఆరోపణలు చేసింది. సినిమా అవకాశాల కోసం నమ్మించి లోబరుచుకున్నారని ఆమె ఆరోపణలు చేసింది. ఏప్రిల్‌లో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది.