Team India Failure Record: టి 20 ప్రపంచకప్ 2021లో కొనసాగుతున్న టీమ్ ఇండియా వైఫల్యంలో అరుదైన ప్రత్యేకత నెలకొంది. పరాజయంలో సైతం టీమ్ ఇండియా ఆ ఘనత దక్కించుకుంది. 22 ఏళ్ల తరువాత తిరిగి ఇదే కావడం ఆ ప్రత్యేకత. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ 20 ప్రపంచకప్ 2021లో(T20 World Cup)టీమ్ ఇండియా పరాజయ యాత్ర కొనసాగింది. తొలి మ్యాచ్‌ను దాయాది దేశంతో కోల్పోయి పరాభవం మూటగట్టుకున్న ఇండియా టీమ్‌కు రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తగిలింది. టీ 20 ప్రపంచకప్‌లో గెలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇలా రెండు వరుస మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లలో ఓటమితో ఇండియా ఓ ప్రత్యేకత సాధించింది. ఒక ఐసీసీ టోర్నీ లేదా ప్రపంచకప్‌లో రెండు వరుస లీగ్ దశ మ్యాచ్‌లలో ఓడిపోవడమనేది ఇండియాకు 22 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. గతంలో అంటే 22 ఏళ్ల క్రితం వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడింది.


ఇంతకుముందు అంటే 1999 వన్డే ప్రపంచకప్‌లో అప్పటి కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ సారధ్యంలోని టీమ్ ఇండియా లీగ్ దశలో రెండు వరుస మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ తరువాత 2007 వన్డే ప్రపంచకప్, 2009, 2010, టి20 ప్రపంచకప్‌లలో టీమ్ ఇండియా గ్రూప్ దశ నుంచే వెనుదిరిగినా..వరుస రెండు మ్యాచ్‌లలో ఓడిపోలేదు. అజారుద్దీన్ తరువాత తిరిగి విరాట్ కోహ్లీ(Virat Kohli)నేతృత్వంలో ఒక ఐసీసీ టోర్నమెంట్‌లో ఇండియా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.ఇక న్యూజిలాండ్ జట్టును ఐసీసీ టోర్నీలో టీమ్ ఇండియా ఓడించి 18 ఏళ్లయింది. తాజాగా మరోసారి ఆ రికార్డు బ్రేక్ చేయడంలో విఫలమైంది. ఐసీసీ టోర్నీలో రెండు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ 8-1 తేడాతో టీమ్ ఇండియాపై రికార్డు మెరుగుపర్చుకుంది. న్యూజిలాండ్‌ను(NewZealand)చివరిసారిగా 2003 వన్డే ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలో టీమ్ ఇండియా ఓడించింది.


మరోవైపు T20 World Cup 2021లో టీమ్ ఇండియా(Team India)ఆశలు సన్నగిల్లుతున్నాయి.సెమీస్‌కు చేరడం దాదాపుగా కష్టంగా మారిన పరిస్థితి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో, రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిన పరిస్థితి. సెమీస్‌కు చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైంది. ఫలితంగా సెమీఫైనల్స్ ఆశలు దాదాపుగా నీరుగార్చుకుంది. ఇక మిగిలింది ఇండియాకు మిగిలిన జట్ల జయాపజయాలపై ఆధారపడి ఎదురు చూడటమే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 14.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఓపెనర్లుగా బరిలో దిగిన కేఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషన్ 4 పరుగులకే వెలుదిరిగారు. ఇక రోహిత్ శర్మ 14 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.కెప్టెన్ విరాట్ కోహ్లి 9 పరుగులకే అవుటై నిరాశ మిగిల్చాడు. ఇక ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో జడేజా ఒక్కడే 26 పరుగులు చేయడం విశేషం. 


Also read: Virat Kohli: పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లలో ఓడిపోవడానికి విరాట్ చెప్పిన కారణాలివీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి