Wasim Akram gives his verdict Player of the Tournament: టీ20 వరల్డ్​కప్​ ముగిసిన అనంతరం పలు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా టోర్నమెంట్ అనంతరం ప్రకటించిన అవార్డులపై వివాదాలు తలెత్తాయి. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్​కు 'మ్యాన్​ ఆఫ్​ ది టోర్నమెంట్​' అవార్డ్ (Man of the Tournament to David Warner) ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వార్నర్​కు ఈ అవార్డ్ ఇవ్వడాన్ని పాక్ మాజీ క్రెకెటర్​ షోయల్ అక్తర్ ఇప్పటికే తప్పుబట్టాడు. ఈ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని కూడా వ్యక్త పరిచాడు. నిజానికి ఈ అవార్డ్ పాక్ కెప్టెన్​ బాబర్ (Babar Azam) అజామ్​కు రావల్సిందని అభిప్రాయపడ్డాడు.


ఈ విషయంపై తీవ్రంగా చర్చ సాగుతుండగా.. పాకిస్థాన్​కు చెందిన మరో మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్​ కూడా (Wasim Akram on Man of the Tournament award) ఈ అంశంపై స్పందించాడు. అయితే అతడు డేవిడ్ వార్నర్​కే ఈ అవార్డ్ ఎందుకు దక్కిందో చెప్పడం గమనార్హం.


Also read: న్యూజిలాండ్‌పై ఇండియా విజయం.. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం


అవార్డ్ ఎందుకు ఇస్తారంటే..


సాధారణంగా ఏదైనా క్రికెట్‌ టోర్నమెంట్​లో అత్యధిక పరుగులు సాధించిన లేదా ఎక్కువ వికెట్లు పడగొట్టిన వారికి మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు ఇస్తుంటారు. అలా 'టీ20 వరల్డ్​కప్​ 2021'లో ఈ అవార్డ్​ ఆస్ట్రేలియన్ ప్లేయర్​ డేవిడ్ వార్నర్​కు దక్కింది.


Also read: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. మెరుగైన ర్యాంకుల్లో వార్నర్, జంపా


వసీమ్ అక్రమ్​ వివరణ ఇలా..


డేవిడ్​ వార్నర్​ టోర్నమెంట్​ మొత్తం మీద 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేశాడు. అయితే ఇదే సమయంలో పాక్ ఆటగాడు బాబర్​ అజామ్​ 6 మ్యాచుల్లో 303 పరుగులు చేయడం గమనార్హం. రన్స్ పరంగా చూస్తే ఈ అవార్డ్ బాబర్ అజామ్​కు దక్కాల్సి ఉంటుంది.


దీనిపై స్పందిస్తూ.. అన్ని సార్లు పరుగులను మాత్రమే చూడలేమన్నాడు వసీమ్ అక్రమ్​. ఆ పరుగుల ప్రభావం జట్టు విజయానికి ఎలా పని చేశాయో కూడా చూస్తారని చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ ఈ టోర్నమెంట్​లో కీలకమైన సమయాల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడని తెలిపాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా టైటిల్​ను సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.


Also read: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..


ఫైనల్స్​లో ఆస్ట్రేలియా ప్రదర్శన..


టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో మిచెల్‌ మార్ష్‌(77), డేవిడ్‌ వార్నర్‌(53) అద్భుతంగా బ్యాటింగ్ చేసి తమ జట్టును గెలిపించుకున్నారు. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో 18.5 ఓవర్లలో గెలుపొందింది.


మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(85) చెలరేగాడు.


Also read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన


Also read: Champions Trophy Host: 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook