Budget 2024: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. 2024 బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు మొబైల్‌ పరికరాలపై  కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే మార్కెట్‌లోకి స్మార్ట్‌ఫోన్స్‌ ధరలపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కస్టమ్‌ డ్యూటీస్‌ తగ్గడం వల్ల స్మార్ట్‌ఫోన్స్‌తో కొనుగోలు చేసే కస్టమర్స్‌తో పాటు టెక్ బ్రాండ్‌లకు భారీ మొత్తంలో ఉపశమనం లభించబోతోంది. ఈ ప్రకటనతో త్వరలోనే మొబైల్స్‌తో పాటు ఇతర టెక్‌ పరికరాలపై భారీగా ధరలు తగ్గనున్నాయి. అయితే కస్టమ్‌ డ్యూటీస్‌లో మార్పుల కారణంగా టెక్‌ మార్కెట్‌లో వచ్చే చేంజెస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు మొబైల్ ఛార్జర్లపై కస్టమ్ డ్యూటీ (BCD) 15 శాతానికి తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత జనవరిలో కేంద్రం స్మార్ట్‌ఫోన్ స్పేర్‌ ఫాట్స్‌పై 10 శాతంకు పైగా దిగుమతి సుంకాన్ని తగ్గించిగా.. ఆర్థిక మంత్రి కస్టమ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం స్మార్ట్‌ఫోన్స్‌ కస్టమర్స్‌ కాస్త ఉపశమనం లభించింది. త్వరలోనే కేంద్రం కస్టమ్ డ్యూటీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


కస్టమ్ డ్యూటీలో మార్పులు:
ఇతర దేశాలకు సంబంధించిన టెక్‌ బ్రాండ్‌లకు సంబంధించిన భాగాలు భారత్‌కి దిగుమతి చేసుకున్న సమయంలో కేంద్రానికి కస్టమ్ డ్యూటీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కస్టమ్ డ్యూటీలు తగ్గడం వల్ల స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు వాటి పరికరాల ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మొబైల్ ఛార్జర్‌ల ధరలపై ప్రభావం పడబోతోంది. అంతేకాకుండా ఈ తగ్గుదల వల్ల టెక్‌ మార్కెట్‌ కూడా ప్రభావితమయ్యే ఛాన్స్‌ ఉంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


2024 బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీల తగ్గింపుపై ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన భారత్‌ మార్కెట్‌పై కాకుండా గ్లోబల్‌ మార్కెట్‌పై కూడా ప్రభావం పడుతుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. బ్రాండ్‌ల వారిగా కస్టమ్ డ్యూటీస్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, Google టెక్‌ కంపెనీ నుంచి Apple, Xiaomi వరకు అన్ని ఇంటర్‌ నేషనల్‌ బ్రాండ్‌ల తయారీ ఉత్పత్తలపై ఖర్చులు తగ్గే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఇతర టెక్‌ కంపెనీలకు సంబంధించిన పరికరాలు కూడా తగ్గనున్నాయి. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి