Kakatiya Medical College Corona: తెలంగాణ హనుమకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీని (Corona cases in Kakatiya Medical College) కరోనా మహమ్మారి వీడటం లేదు. తాజాగా మరో 15 మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో కళాశాలలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 42కు చేరింది.  ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా విద్యార్థులకు వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వరుసగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 1825 మందికి వైరస్​ (Corona cases in Telangana) పాజిటివ్ గా (Corona cases in Telangana) నిర్ధారణ అయింది. వైరస్ తో ఒకరు మృతి చెందారు. నిన్న కరోనా నుంచి  351 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో 1042 కేసులు వెలుగుచూడటం కలకలం సృష్టిస్తోంది. 


Also Read: Telangana Corona Update: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కొవిడ్‌ కేసులు నమోదు!


దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఒమిక్రాన్ (Omicron Variant) కల్లోలం సృష్టిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ (Corona Thirdwave) ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో... కేంద్రం టీకా సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook