Corona cases in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,583 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1673 మందికి వైరస్ పాజిటివ్‌ (Corona cases in Telangana) గా తేలింది. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్‌ కేసులు (Active Cases in Telangana) ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,042కి (Corona Deaths in Telangana) చేరింది. కరోనా నుంచి 330 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 1165 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123, సంగారెడ్డి జిల్లాలో 44, హనుమకొండ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 97.46 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: Traffic restrictions in Hyderabad : హైదరాబాద్‌లో పది రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు


రేపట్నుంచి బూస్టర్​ డోసు..
కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసును (booster dose in telangana) ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని కోరారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సీఎం సూచించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook