Telangana Omicron Cases : తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో (Telangana) మరో మూడు ఒమిక్రాన్ కేసులు (3 fresh Omicron cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కి చేరింది. ఒమిక్రాన్‌ నుంచి ఇప్పటి వరకు 10మంది బాధితులు కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 గత 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 248 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా.. ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా (Covid-19 Positive) నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 3 ఒమిక్రాన్‌ కేసులు (Omicron Cases in Telangana) వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన  కేసుల సంఖ్య 44కి చేరింది.


Also Read: Telangana Omicron Cases : తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్‌ కేసులు.. మొత్తం 41 కేసులు


తెలంగాణలో కొత్తగా 109 పాజిటివ్‌ కేసులు (Today Corona Cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,662కి చేరింది. వైరస్ తో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,022కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,167 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook