Yadadri Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా... ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...
యాదాద్రి భువనగిరి జిల్లాలోని (Yadadri Bhuvanagiri district) ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్‌ను నిలిపి ఉంచారు. ఆ పక్కనే కూలీలు కూలీలు వర్క్ చేస్తున్నారు. ఆ సమయంలో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు (RTC Bus) వెళ్తుంది. అయితే, వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో పాటు కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. 


క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలేరు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన కారణంగా జనగామ-హైదరాబాద్‌ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌ జామ్ అయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 


Also Read: Kurnool: బస్సు సీట్ల కింద భారీ నగదు.. బనియన్లలో బంగారం.. స్వాధీనం చేసుకున్న అధికారులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook