Telangana Omicron Cases; తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 7 ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in Telangana) వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish rao) తెలిపారు. 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని మంత్రి వెల్లడించారు. ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందికి స్క్రీనింగ్‌ చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా తొలిడోసు వ్యాక్సినేషన్‌ (Vaccination) వంద శాతం పూర్తి అయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 653 ఒమిక్రాన్‌ కేసులు (Omicron cases in India) నమోదయ్యాయని కేంద్రఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు 186 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. దేశంలో 24 గంటల వ్యవధిలో 6,358 కరోనా కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,450 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 75,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. 


Also Read: Omicron Scare: రాష్ట్రంలో మరో 12 మందికి ఒమిక్రాన్​ పాజిటివ్​- 55కు చేరిన మొత్తం కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook