Bittu Srinu arrested in Vaman Rao murder case: పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హై కోర్టు అడ్వకేట్ దంపతులు వామన రావు, పి.వి. నాగమణిల హత్య కేసులో అరెస్ట్ అయిన బిట్టు శ్రీనును మంథని పోలీసులు ఇవాళ కోర్టు ఎదుట హాజరుపరిచారు. బిట్టు శ్రీనును కోర్టులో హాజరు పరుస్తున్నారనే సమాచారంతో అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న లాయర్లు.. బిట్టు శ్రీనుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. వామనరావు, నాగమణి దంపతులను హత్య చేయించిన బిట్టు శ్రీనుకు కఠిన శిక్ష పడాలని నినాదాలు చేసిన లాయర్లు.. Vaman Rao, PV Nagamani murder case ను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణను సస్పెండ్ చేయాలంటూ లాయర్లు చేసిన నినాదాలతో Manthani court పరిసరాలు మార్మోగిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Advocates couple Murder case: లాయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురు accused arrest


మంథని కోర్టు ఎదుట Bittu Srinu ను హాజరుపర్చనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు సైతం అక్కడ భారీ సంఖ్యలో చేరుకుని ఉండటంతో వారు లాయర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామన రావు, నాగమణి దంపతుల హత్య కేసులో అరెస్ట్ అయిన బిట్టు శ్రీను.. హంతకులకు అవసరమైన వాహనం, కత్తులు సమకూర్చినట్టు అంగీకరించాడని పోలీసులు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook