Bride Commits Suicide: విశాఖ సృజన ఘటన మరవకముందే మరో నవ వధువు ప్రాణం తీసుకుంది.  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవ వధువు తనువు చాలించడం  తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు హుషారుగా కనిపించిన పెళ్లి కూతురు విగత జీవిగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా పాతతోటకు చెందిన లక్ష్మీ అనే యువతికి అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జునతో పెళ్లి నిశ్చయం అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం పెళ్లి తంతు ముగిసింది. పెళ్లి తర్వాత  నవ దంపతులు డ్యాన్సులతో అలరించారు. పెళ్లి కూతురు నృత్యాలు ఆకట్టుకున్నాయి. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళ లాడిన ఇళ్లు ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. నవ వధువు పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అపస్మార స్థితికి వెళ్లిన ఆమెకు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇష్టం లేని పెళ్లి చేశారనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి పూర్తి అవగానే బాత్‌రూమ్‌లోకి వెళ్లి పురుగుల మందు సేవించినట్లు బంధువులు చెబుతున్నారు. 


ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. నవ వధువు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..ఘటనపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏదైన ప్రేమ వ్యవహారం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also read:Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!


Also read:One Family One Ticket: రేవంత్ రెడ్డి,ఉత్తమ్, భట్టి,కోమటిరెడ్డికి షాక్! టీపీసీసీలో రచ్చేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.