రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెలిసినవాడే కదా అని కారులో వెళ్తే క్యాబ్ డ్రైవర్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని షాబాద్ మండలం చందనవల్లికి చెందిన యువతి హయతాబాద్‌లో సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. అదే సమయలో ఆమె గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ షాపులో తన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఢిల్లీ తర్వాతి టార్గెట్ హైదరాబాద్.. నగరవాసుల్లో గుబులు


సిమ్ తీసుకుని యువతి గ్రామానికి బయలుదేరుతుండగా క్యాబ్ డ్రైవర్ ఆమెతో మాట కలిపాడు. తాను కూడా ఇంటికే వెళ్తున్నాడని కారులో లిఫ్ట్ ఇస్తానని నమ్మించాడు. తన గ్రామానికి చెందిన వాడే కావడంతో యువతి నమ్మి అతడితో వెళ్లింది. అయితే మరో మూడు కిలోమీటర్లయితే తమ గ్రామం చందనవల్లి వస్తుందనగా క్యాబ్ డ్రైవర్ దారి మళ్లించాడు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై పశువులా ప్రవర్తించాడు.


Also Read: మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్ 


తప్పించుకునేందుకు యత్నించిన బాధితురాలిపై దాడిచేసి లొంగదీసుకున్నాడు. పశువాంఛ తీర్చుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Also Read: అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరితో సినిమా.. షూటింగ్ దాదాపు పూర్తి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..