హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ కు కేసీఆర్ చేసింది ఏమీ చేయలేదని విమర్శించారు. టీడీపీ హయంలో హైదరాబాద్  నగరం హైటెక్ సిటీగా గుర్తింపు వచ్చిందని..ఎవరు ఏమన్నా సైబరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తాను తీసుకున్న చర్యల వల్లే హైదరాబాద్ లో యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. తాను  వేసిన అభివృద్ధి బాటను కాంగ్రెస్ కొనసాగించిందంటూ చంద్రబాబు కొనియాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ కు ఆ హక్కులేదు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను రాష్ట్రానికి ఓ విజన్ ఇచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు . తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నోపథకాలు అమలు చేశానని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ ప్రజలకు ఇన్ని చేసిన తనకు తెలంగాణలో ఏం పని చేయని  కేసీఆర్ తనను ప్రశ్నిస్తున్నారు.. తనుకు తెలంగాణలో అడుగు పెట్టవద్దని చెప్పే హక్కు కేసీఆర్ కు లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.