CM KCR meets Colonel Santosh Babu`s family: సూర్యాపేట: ఇండో చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు (  Colonel Santosh Babu ) కుటుంబసభ్యుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"186820","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఎప్పుడు, ఎలాంటి అసవరమొచ్చినా తమను సంప్రదించాలని... ఎల్లప్పుడూ అండగా ఉంటామని కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించారంటూ కల్నల్ సంతోష్ బాబు (  Col.Santosh Babu ) దైర్యసాహసాల్ని కేసీఆర్ కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. 


దేశం కోసం ప్రాణాలొడ్డిన సంతోష్ బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని కేసీఆర్ చెప్పారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని సంతోష్ బాబు భార్య సంతోషికి  స్వయంగా కేసీఆర్  అందించారు. మరోవైపు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 711 గజాల  ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆమెకు అందించారు. అంతేకాకుండా సంతోష్ బాబు భార్యకు 4 కోట్ల రూపాయల చెక్‌ను... సంతోష్ తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను అందించారు.