అధికార తెరాస ఎమ్మెల్యేపై విరుచుకుపడిన కాంగ్రెస్ వర్గీయలు
తెలంగాణ సహకార సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో టీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ సహకార సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో టీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగిన సహకార ఎన్నికల్లో పోలింగ్ సెంటర్ వద్ద ఇరువర్గాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్రమైన గందరగోళం నెలకొంది.
దీంతో ఆయన కుడి కన్నుకు గాయమైంది. వెంటనే ఎమ్మెల్యేని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ గందరగోళం మధ్య బ్యాలెట్ పేపర్లు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయని ఎన్నికల నిర్వాహణ అధికారులుతెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికల అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..