Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ వైరస్‌ భయాందోళనకు కల్గిస్తోంది. గతకొంతకాలంగా దాదాపు 5 వందల వరకు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 4 వేల మందికి పైగా పరీక్షలు చేయగా..457 మందిలో వైరస్ బయటపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటు కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో 494 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4 వేల 747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నమోదు అవుతున్న కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు అవుతున్నాయి. కొత్తగా 285 కేసులు ఇక్కడి నుంచే వెలుగు చూశాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్‌ను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.


Also read:Pakistan Accident: పాకిస్థాన్‌లో మృత్యులోయ.. 19 మంది మృతి..11 మందికి గాయాలు..!


Also read:PM Modi: పోరు గడ్డ నుంచి రూట్‌ మార్చిన పీఎం మోదీ..రాజకీయాలు లేకుండా ప్రసంగం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook