Coronavirus Telangana Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 397 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,85,465 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,535 కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే కొత్త కరోనా కేసులతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 627 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,77,931 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో (Covid-19) 5,999 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also Read: Ram Charan: రామ్ చరణ్‌కు కరోనా వైరస్.. ట్వీట్ చేసిన మెగాపవర్ స్టార్


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.36 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నిన్న 42,737 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 28వ తేదీ వరకు మొత్తం 67,93,691 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 92 కేసులు నమోదయ్యాయి. Also Read: India Vs Australia: ఆసీస్‌పై భారత్ ఘన విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook