Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం రెండింటి సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. గత24 గంటల్లో (జనవరి 7న) గురువారం రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 346 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ (TS Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,89,135 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,561 కి చేరింది. ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 397 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,82,574 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 5 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97.73 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. Also Read: India Covid-19: కొత్తగా 18వేల కరోనా కేసులు


ఇదిలాఉంటే.. రాష్ట్రంలో (Telangana) నిన్న 38,985 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 7వ తేదీ వరకు మొత్తం 71,84,598 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 66 కేసులు నమోదయ్యాయి.


Also Read: Farmers Protest: నేడు మరోసారి చర్చలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook