COVID-19 cases in telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 24 గంటల్లో 1,36,096 మందికి కరోనా పరీక్షలు చేయగా... వారిలో కొత్తగా 2,175 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. యధావిధిగానే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే (GHMC) అత్యధికంగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో రాష్ట్రంలో కరోనాతో 15 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,346 కి చేరింది. తాజాగా కరోనా వైరస్ నుంచి 3,821 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 5,53,400 కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 94 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Also read : COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?


తెలంగాణలో 1,100 వరకు బ్లాక్ ఫంగస్ కేసులు (Black fungus cases in Telangana) గుర్తించామని, వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ వార్తా కథనంలో పేర్కొంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, వైట్ ఫంగస్ లక్షణాలతో (Black fungus symptoms, white fungus symptoms) బాధపడే వారిని గుర్తించి వారికి తగిన వైద్య సహాయం అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తోంది.


Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook