Hyderabad Covid: దేశంలో కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ ...తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌(Covid-19 Positive)గా తేలింది. యూకే, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్‌లో ఉంచారు. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Omicron Variant: ఢిల్లీ LNGP ఆస్పత్రిలో 12 ఒమిక్రాన్‌ అనుమానిత కేసులు!


తెలంగాణలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు(Omicron Cases) బయటపడక పోయినా.. విదేశాల నుంచి ఇటీవల వచ్చిన ఓ మహిళకు పాజిటివ్ అని తేలింది. బాధితురాలికి టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉంది. మహిళ తల్లిదండ్రులను సైతం హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పటికే బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు(Omicron Cases) నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook