Hyderabad | కొంత కాలం క్రితం హైదరాబాద్ మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులకు ఆర్థికంగా అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం ప్రకటించింది లక్షల మందికి డబ్బులు అందించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ సహాయం ఎన్నికల నిబంధనల్లో భాగంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం


తాజాగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కొనసాగుతోందని బుధవారం జీహెచ్‌ఎంసీ (GHMC) స్పష్టం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్ (Hyderabad) మున్సిపాలిటీ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో ఎలాంటి అసతం చూపించడం లేదు అని తెలిపింది.


ఇక బాధితులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు వారికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం మంగళవారం నుంచి మళ్లీ మొదలైంది అని..24 గంటల్లోనే మొత్తం 7,939 మందికి సుమారు 7 కోట్ల 90 లక్షలు అందించామని తెలిపింది జీహెచ్ఎంసి.



Also Read | Rythu Bandhu: త్వరలో మరో విడత రైతు బంధు ప్రారంభం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook