Bandi Sanjay Basti Nidra | భారతీయ జనతా పార్టీ దుబ్బాక విజయం తరువాత అదే జోరును గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చూపిస్తోంది. అందులో భాగంగా బీజేపీ నేతలు బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీలోని నేతలకు తెలంగాణ బీజేజీ అధ్యక్షుడు బండి సంజయ్ సూచనలు జారీ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1.Also Read | GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్ 


గ్రేటర్ ఎన్నికల్లో (GHMC Elections 2020 ) భాగంగా భారతీయ జనతా పార్టీ నేతలు బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేయాలి, కార్యకర్తలకు, డివిజన్లలో పోటీ చేస్తున్న కాండిడేట్స్ కు ఇదే నా పిలుపు అని తెలిపారు బండి సంజయ్. అందులో భాగంగా పార్టీ నేతలతో కలిసి బస్తీ నిద్ర చేస్తామని తెలిపారు. 



Also Read: Vastu Tips: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి |


బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు బస్తీలో నిద్రిస్తా అని ప్రకటించించారు బండి సంజయ్ ( Bandi Sanjay). ఈ కార్యక్రమంలో భాగంగా సామాన్య ప్రజల మధ్య వారి బస్తీల్లో నిద్రిస్తాను అని.. వారి సమస్యలు తెలుసుకొని వారిలో ఒక్కిరిగా కలిసిపోవాలి అనుకుంటున్నాను అని తెలిపారు. కార్పోరేటర్లుగా బీజేపీ అభ్యర్థులు గెలిచిన తరువాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని హితవు పలికారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR