హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 200 నుంచి 300 మధ్య ఓట్ల తేడాతోనే ఓటమిపాలైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్టుగా మరో 20-25 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భావించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మరీ ముఖ్యంగా బీఎన్ రెడ్డి నగర్ లో 18 ఓట్లు, మల్కాజిగిరిలో 70 ఓట్లు, మూసాపేటలో సుమారు 100 ఓట్లు, అడిక్ మెట్, మౌలాలి వార్డులలో సుమారు 200 ఓట్ల తేడాతోనే పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని చెబుతూ.. గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదని కేటీఆర్ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ( GHMC Elections Results 2020 ) వెల్లడి అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : GHMC Election results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపి స్పందన..


ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ పదవి ( Hyderabad mayor ) గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC ) పాలకమండలికి ఇంకా 2 నెలల గడువు మిగిలి ఉందని... ఆలోగా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోలేనప్పటికీ.. పార్టీ శ్రేణులు నిరాశ పడాల్సిన అవసరం లేదని, ఎక్కువ స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని చెప్పి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు కేటీఆర్ ( Minister KTR ) ప్రయత్నించారు.


Also read : MP Arvind Dharmapuri: తెలంగాణలో బీజేపికి 15 లోక్ సభ సీట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook