హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌​ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ అమాయకురాలి నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉన్మాదిగా మారిన ఓ యువకుడు యువతి గొంతుకోసి దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపుతోంది. హన్మకొండలోని స్థానిక రాంనగర్‌ ఏరియాలో శుక్రవారం (జనవరి 10న) ఈ ఘటన జరిగింది.


కాజీపేటకు చెందిన షాహిద్, గుండ్లసింగారంకు చెందిన యువతి గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. కాలేజీ నుంచి యువతి రాంనగర్‌లోని షాహిద్ రూముకు వెళ్లింది. అయితే వారిద్దరి మధ్య ఓ విషయంలో మాటామాటా పెరిగి గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోపోద్రేక్తుడైన నిందితుడు షాహిద్ కత్తితో యువతిపై దాడి చేసి గొంతుకోసి పరారైనట్లు స్థానికుల చెబుతున్నారు. హత్య చేసిన షాహిద్.. జడ్జి ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..