Woman Brutally Attack On Her Husband: సాధారణంగా ఆలుమగలన్నాక గొడవలు కామన్. కొత్తగా పెళ్లైన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు, ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటాయి.  ఈ క్రమంలో..  ఒకరితోమరోకరు మాట్లాడాలి. వైవాహిక జీవితంలో ఎలా కలిసి మెలసి ముందుకు వెళ్లాలో మాట్లాడుకొవాలి. ఇద్దరు కూడా పెరిగిన వాతావరణ, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో కొద్దిగా బేధాభిప్రాయాలు ఏర్పడతాయి.  ఈ క్రమంలో కొందరు క్షణికావేశంలో తమ పవిత్రమైన వివాహ బంధాన్ని అపహస్యం చేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Instant Dosa: కేవలం ఐదే ఐదు నిమిషాలలో దోశను ఇలా తయారు చేసుకోవచ్చు..


తమ భర్త లేదా భార్య పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ఇది కాస్త పంచాయతీల వరకు వెళ్తుంది. పరస్పరం దూషించుకోవడం, దాడులు చేసుకొవడం వంటికి కూడా జరుగుతుంటాయి. మరికొందరైతే.. దీన్ని మాట్లాడి సమస్యలను పెద్దల వరకు తీసుకెళ్లి వారి సలహాలు పాటించి చక్కగా కాపురం చేసుకుంటారు. ఇక.. మరో కెటాగిరి ఉంటారు.. వీరు ప్రతిదానికి డైవర్స్ అంటూ, కేసులంటూ భర్త లేదా భార్యలను పీడించుకు తింటుంటారు. ఇలాంటి ఘటనల్లో మహిళలు, పురుషులు కూడా ఎవరు కూడా తీసిపోవట్లేదు. అచ్చం ఇలాంటి  ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


హైదరాబాద్ లో కట్టుకున్న వివాహిత , తన  భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ నగర్ లో.. గుండప్ప తన భార్య లక్ష్మి తో నాలుగు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం.


పోలీసులు ప్రకారం.. ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య విపరీతమైన గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఇద్దరు గొడవలు పడటం పరిపాటిగా మారిపోయింది. దీంతో భార్య లక్ష్మి భర్తకు ఎన్నో విధాలుగా సర్దిచెప్పాలని చూసింది. వీరి ఇంటికి సమీపంలోనే లక్ష్మి సోదరులు.. గోవింద్, బాలాజీ ఉండేవారు. కుటుంబ సభ్యులు ఎవరు చెప్పిన కూడా గుండప్ప వ్యవహరంలో ఎలాంటి మార్పు రాలేదు.


Read More: Pragya Jaiswal: హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్, లేటెస్ట్ పిక్స్ వైరల్


దీంతో విసిగిపోయిన లక్ష్మి కుటుంబం.. ఈ నెల రాత్రి 7న రాత్రి మరల ఇద్దరు గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బామ్మర్దులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే బావను బామ్మర్దులు గట్టిగా కదలకుండా పట్టుకున్నారు. అంతే కాకుండా కర్రలతో కూడా కొట్టి నట్లు సమాచారం. ఇక భార్య లక్ష్మి తానేం తక్కువ కాదన్నట్లు భర్తను.. గరిటె కాల్చి మరీ చెంపపై వాతలు పెట్టింది. దీంతో భయపడిపోయిన గుండప్ప  బంజారా హిల్స్ పీఎస్ కు వెళ్లాడు. తనపై కట్టుకున్న భార్యన లక్ష్మి, బామ్మర్దులు దాడి చేశారని గుండప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook