హైదరాబాద్ : హైదరాబాద్ : కామాంధుల నుంచి మహిళలు, చిన్నారులకే కాదు... చివరకు పశువులకు కూడా రక్షణ లేదని మరోసారి నిరూపితమైంది. నోరు లేని పశువులపైనే పశువాంఛ తీర్చుకుంటున్న వీడిని పశువు అని పిలిస్తే.. ఆ పశువులు సైతం సిగ్గుపడతాయేమో!! సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఉన్న అవంతి నగర్‌లో చోటుచేసుకుంది. 9 నెలల లేగ దూడపై అత్యాచారానికి పాల్పడుతున్న మహేష్ అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. దూడపై మహేష్ అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని గమనించిన ప్రత్యక్ష సాక్షి.. పోలీసులకు సమాచారం అందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దూడపై అత్యాచారం విషయమై ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడుతూ... మహేష్ గత కొన్నేళ్లుగా పశువులపై అత్యాచారం చేస్తున్నాడని ఆ పశువుల కొట్టం యజమానికి చెప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని.. అందుకే చివరకు ఇలా పోలీసులకు పట్టించాల్సి వచ్చిందని వాపోయారు. అంతేకాకుండా జంతు సంరక్షణ కోసం కృషిచేస్తోన్న ఓ ఎన్జీవో సంస్థకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మహేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై ఐపిసి 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 


దూడను వైద్య పరీక్షల కోసం వెటర్నరీ హాస్పిటల్‌కి తరలించామని.. అలాగే నిందితుడు మహేష్‌ని సైతం లైంగిక పటుత్వం పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత మహేష్‌ని కోర్టులో హాజరు పర్చనున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ పశువుల కొట్టం యజమాని ఎవరా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..