Warning Call:  విశ్వహిందూ పరిషత్ నేతకు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. తెలంగాణ వీహెచ్ పీ అధికార ప్రతినిధిగా ఉన్న రావినుతల శశిధర్ కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి అతనికి ఫోన్ చేసి బెదిరించాడు. పిస్టల్ తీసుకుని వచ్చి మీ ఇంట్లోనే కాల్చి పడేస్త అంటూ ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తనకు వచ్చిన బెదిరింపు కాల్ పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రావినూతన శశిధర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 10న కూడా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గేట్ కొట్టి ఉర్దూలో ఆవేశంగా మాట్లాడి పరారైనట్లు శశిధర్ ఫిర్యాదులో తన పేర్కొన్నారు. నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శశిధర్ ఫిర్యాదుపై కేస్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోన్ కాల్‌ ఆధారంగా ఆరా తీస్తున్నారు. శశిధర్ ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


విశ్వహిందూ పరిషత్ లో శశిధర్ బలమైన నాయకునిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సరూర్ నగర్ పరువు హత్య కేసులో తీవ్రంగా పోరాడారు. హిందూత్వం బలోపేతం కోసం పనిచేస్తుండగా అది నచ్చని కొంత మంది ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన అనుచరులు, వీహెచ్ పీ నేతలు చెబుతున్నారు. వీహెచ్ పీ నేతను చంపేస్తామంటూ బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది.


Read also: Konda Film: రేవంత్ రెడ్డి పులి.. దయాకర్ రావుకు డైపర్లే! తీన్మార్ పంచ్ లతో కొండా డాటర్ పొలిటికల్ ఎంట్రీ?  


Read also: Thalapathy Vijay : ఆఫీసులో వ్యక్తి అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన పరోటా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook