తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజమాబాద్ లో ఓటమి పాలయ్యారు. కవితపై బీజేపీ అభ్యర్ధి 69 వేల మెజార్టీతో గెలుపొందారు. తాజా విజయం టీఆర్ఎస్ పార్టీకి నిరాశ కల్గిస్తుండగా... బీజేపీకి నూతనోత్సహాన్ని ఇచ్చింది. గత ఎన్నికల్లో నిజామాబాద్ అభ్యర్ధిగా గెలుపు సాధించిన కవిత..మోడీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఈ సారి ఓటమి చూడాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి 170 మందికిపైగా రైతులు పోటీలో నిలవడంతో ఈ ఎన్నిక నిర్వహణ ఈసీకి సవాల్‌గా నిలిచిన విషయం తెలిసిందే.