Komatireddy Venkat Reddy:  మునుగోడు ఉపఎన్ని క పోలింగ్ సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి షాకులు తగులుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా వెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం రోజురోజుకు బలహీనమవుతోంది. సిట్టింగ్ సీటు అయినా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితికి జారీ పోతోంది. రోజుకో లీడర్ ఇతర పార్టీలోకి చేరిపోతున్నారు. రెండు రోజుల క్రితమే మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవికుమార్ హస్తానికి హ్యాండిచ్చి కారెక్కెశారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్, బీజేపీలో చేరిపోయారు. తాజాగా మునుగోడు ప్రచారానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని మరోసారి స్పష్టం చేశారు. తాను హోంగార్డు లాంటి వాడినన్న కోమటిరెడ్డి.. మునుగోడు ప్రచారానికి ఎస్పీ రేంజ్ లాంటి వాళ్లే వెళతారని అన్నారు. తనపై వంద కేసులు పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకువస్తానని ఓ వ్యక్తి చెబుతున్నాడని.. ఆయనే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ గానే చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి హోంగార్డులని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. తనకు పీసీసీ పదవి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి సోదరులకు కౌంటర్ ఇచ్చే క్రమంలో.. హోంగార్డులు ఎప్పటికి అలానే ఉంటారని.. ఎస్పీలు కాలేరని అన్నారు. ఎస్పీలు డైరెక్ట్ గా వస్తారన్నారు. తమను కాదని ఎస్పీ ఎలా వస్తారంటూ హోంగార్డులు ప్రశ్నిస్తారా అన్నారు రేవంత్ రెడ్డి.


రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలపై గతంలోనూ  తీవ్రంగా స్పందించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాజాగా మునుగోడు ఉపఎన్నిక విషయంలో మరోసారి హోంగార్డు వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.వెంకట్ రెడ్డి రాకపోతే మునుగోడులో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది కదా అని మీడియా ప్రశ్నించగా.. తనపై వంద కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ఓ నాయకుడు చెప్పాడంటూ పరోక్షంగా రేవంత్ ను  మునుగోడులో పార్టీని ఆయనే గెలిపిస్తారని ఇక తమతో పని లేదని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి.


దుమారం రేపుతున్నాయి. చాలా రోజుల అనంతరం ఇవాళ గాంధీ భవన్‌కు వచ్చిన వెంకట్ రెడ్డి ఇక తమతో పార్టీకి పని లేదని, అంతా ఎస్పీ రేంజ్ స్థాయి వ్యక్తినే చూసుకుంటారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వెంకట్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనేది తెరపైకి వస్తోంది. ఇక తాను ఎప్పుడు విదేశాలకు వెళ్తానో అనేది మంత్రి కేటీఆర్ కే తెలుసని అన్నారు. కడియం శ్రీహరికి తనను విమర్శించే స్థాయి లేదని ఫైరయ్యారు. కాగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఫేవర్ చేయడానికే వెంకట్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని హస్తం పార్టీలోని మరో వర్గం ఆరోపిస్తోంది. 


Read Also: Hansika Motwani Marriage : సైలెంట్‌గా హన్సిక పెళ్లి ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే?


Read Also: AICC President Election: గాంధీ భవన్ లో 45 ఇండస్ట్రీ లీడర్  గోల... అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రచ్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook