Malkajgiri loksabha elections results update 2024: దేశంలో ఓటర్ల పరంగా మల్కాజ్ గిరి దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గంగా చెప్తుంటారు. ఇక్కడ దాదాపు 38 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. దీన్ని మినీ ఇండియాగా అనికూడా పిలుస్తారు. అందుకే దేశంలో ఇప్పుడు మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంహాట్ టాపిగ్ మారింది. 2008 లో మల్కాజ్ గిరి నియోజవర్గం ఏర్పడిందని చెబుతారు.  మల్కాజ్ గిరిలో తొలిసారి 2009 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో సర్వే సత్యనారయణ గెలుపొందారు. ఇక్కడ ఇప్పటి దాక మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. మూడు సార్లు కూడా భిన్నమైన పార్టీలకు చెందిన వారిని ప్రజలు ఎంపిక చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


ఇక్కడ మెజారీటీ గా స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు,  స్థానికేతులు  కూడా ఉన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజిగిరి లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇది పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన నియోజకవర్గం. 2014 లో టీడీపీ తరపున మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2019 లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి 603,748 ఓట్లు పోలవగా.. మర్రి రాజశేఖర రెడ్డికి 5,92,829 ఓట్లు పడ్డాయి.


బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్ర రావు 3,04,282 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2019 లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సీఎల్పీ లీడర్‌గా ఎన్నికైన ఆయన తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టే ముందు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వగా.. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. ఇప్పటికే ఎన్నికౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లీడింగ్ లో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలోని 17 స్థానాలలో బీజేపీ దాదాపు.. 12 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నట్లు ఇప్పటి వరకు అందిన ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది. ఈటల రాజేందర్ 18546 వేల ఓట్లతో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మల్కాజ్ గిరిలో 21 రౌండ్లలో ఫలితాలు రానున్నాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి ఈటల రాజేందర్ 1లక్ష 70 వేల ఓట్ల మెజారిటీలో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఈటల రాజేందర్ కు 4లక్షల 43వేల ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్  అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి 2 లక్షల 73 వేల ఓట్లు పోల్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థుల్లో ఈటల రాజేందర్ అత్యధిక మెజారిటీతో కొనసాగుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter