Family Dispute: సాధారణంగా పెళ్లి జరిగాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. భార్యా, భర్తలన్నాక గొడవలు జరుగుతుంటాయి. వీటిని ఇద్దరు కూడా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఇద్దరు పెరిగిన వాతావరణం, కుటుంబాలకు వేర్వేరుగా ఉండటం వల్ల ఆలోచనలు, అలవాట్లు కాస్త భిన్నంగా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని జంటలు ఏవైన బేదాభిప్రాయాలుంటే మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. మరికొందరు డబ్బులు కావాలని, కట్నం తేవాలని భార్యలను పుట్టింటిలో వదిలేస్తుంటారు. పెద్దవాళ్లు ఎంతగా చెప్పిన కూడా తమ భార్యను పట్టించుకోరు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


పూర్తి వివరాలు.. 


తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవుని పిల్లికి చెందిన శ్యామలకు, మెదక్ జిల్లా కూచారాంకు చెందిన అరుణ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజులు కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శ్యామలు తన పుట్టింటికి వెళ్లిపోయింది.


పెద్దలంతా కలసి అరుణ్ కు ఎంతగా చెప్పిన కూడా వినలేదు. చివరకు అతగాడి బామ్మర్ది శ్యామ్ సుందర్ కూడా ప్రాధేయ పడి వినలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు స్నేహితులతో బావ అరుణ్ మర్డర్ కు కలసి స్కెచ్ వేశాడు. ఈ విషయం బైటపడటంతో అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 


Read Also: Bigg Boss: షాకింగ్... ఫ్లాట్‌ లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, సీరియల్ నటి పై అత్యాచారం.. డిటెయిల్స్ ఇవే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook