Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. నీ సంగతి చూస్తానంటూ మైక్ లోనే బెదిరించారు. రాజగోపాల్ రెడ్డి మాటలతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తపై దాడికి యత్నించారు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తప్పించారు. రాజగోపాల్ రెడ్డి బెదిరించిన వీడియో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు రోజుల క్రితం కూడా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడికి నిరసన సెగ తగిలింది. మునుగోడు మండలం  కోతులాపురంలో ఆయనను స్థానికులు నిలదీశారు. గత ఎన్నికల సమయంలో తమ గ్రామానికి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్వించారు. ఎన్నికల ప్రచారం చేయకుండానే అక్కడి నుంచి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోయారు. చౌటుప్పల్ మండలంలోనూ రాజగోపాల్ రెడ్డికి నిరసన ఎదురైంది. అల్లాపూర్ గ్రామంలో ఆయన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీకి అమ్ముడుపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook