వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తోన్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ బస్ స్టాప్ వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ వీరేంద్ర యాదవ్, ప్రయాణికులు చెన్నూరు లక్ష్మి, బాల విఘ్నేష్‌లను అధికారులు మెరుగైన వైద్య సహాయం కోసం హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. 


డ్రైవింగే చేసేటప్పుడు అప్రమత్తంగా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగే ప్రమాదాలు ఎటువంటి అనర్థాలకు దారితీస్తాయో ఈ రోడ్డు ప్రమాదం నిరూపించింది.