హైదరాబాద్: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. త‌మ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనియా గాంధీ కేవలం ఎంపీ మాత్రమే కాదని.. పార్లమెంటరీ పార్టీ నాయకురాలు కూడా అయినటువంటి ఆమెపై అర్నాబ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ సీనియర్ సభ్యుల్లో ఒకరైన సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్నాబ్ గోస్వామిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాల్సిందిగా రేవంత్ రెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.


[[{"fid":"184792","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"float: left;","class":"media-element file-default","data-delta":"1"}}]]