తెలంగాణ ( Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 7న పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అవనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఇతర ప్రధాన అంశాలు, సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రేపు ఉదయం 11.30 నిమిషాలకు సీఎం కేసీఆర్ ( KCR ) అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతీ భవన్ లో ఈ మీటింగ్ జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్


ఈ మీటింగ్ లో తెలంగాణలో శాంతి భద్రతలు, అడవుల సంరక్షణ, డ్రగ్స్ కంట్రోలింగ్, స్మగ్లింగ్ ను అరికట్టడం, మహిళల రక్షణ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి అని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ, అటవీశాఖ మినిస్టర్ ఇంద్రకరణ రెడ్డి, ప్రభుత్వ సీఎష్ సోమేష్ కుమార్ తో పాటు డీజీపి మహేందర్ రెడ్డి ఇతర ప్రముఖ అధికారులు పాల్గోనున్నారు.


ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి సమాచారం అందించింది. 
ఆ ట్వీట్ ఇదే..



ALSO READ|  Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR