తెలంగాణ ఎన్నికలను పురస్కరించుకొని మహాకూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ తమకు కేటాయించిన 14 స్థానాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ఓ ప్రకటనను విడుదల చేశారు. పలువురు కీలక నాయకులకు ఈ తొలి జాబితాలో చోటు కల్పించారు. సీనియర్‌ నాయకుడు నామా నాగేశ్వరరావును ఖమ్మం నుండి బరిలోకి దింపనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే మరో ప్రముఖ టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వరంగల్‌ పశ్చిమ స్థానాన్ని కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సత్తుపల్లి టికెట్ ఇవ్వగా.. మాజీ ఎమ్మెల్యే దయాకరరెడ్డికి మక్తల్‌ టికెట్‌ ఇచ్చారు. శేరిలింగంపల్లి నుండి ప్రముఖ వ్యాపారి భవ్య ఆనంద  ప్రసాద్‌‌ను బరిలోకి దింపనున్నారు.  మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ బరిలోకి దిగేందుకు సంసిద్ధమవ్వగా..  దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌కు ఉప్పల్‌ టికెట్‌ లభించడం గమనార్హం. 


ప్రస్తుత సమాచారం ప్రకారం తెలంగాణలో బరిలోకి దిగనున్న తెలుగుదేశం నేతలు వీరే
1.ఖమ్మం - నామా నాగేశ్వరరావు
2.శేరిలింగంపల్లి - భవ్య ఆనందప్రసాద్
3.మలక్ పేట - ముజఫర్ ఆలీ
4.ఉప్పల్ - వీరేంద్ర గౌడ్
5.పశ్చిమ వరంగల్ - రేవూరి ప్రకాష్ రెడ్డి
6.సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
7.మహబూబ్ నగర్ - ఎర్ర శేఖర్
8.అశ్వారావ్ పేట - మచ్చా నాగేశ్వరరావు
9.మక్తల్ - దయాకర్ రెడ్డి