Rythu Bandhu: తెలంగాణ సర్కార్ రైతు బంధు నిధులు విడుదల చేసింది. తొలి రోజు ఎకరా లోపు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో ఎకరా లోపు ల్యాండ్ ఉన్న రైతులు  19 లక్షల 98 వేల 285 మంది ఉన్నారు. వీళ్లకు సంబంధించిన 586 కోట్ల 66 లక్షల రూపాయలను మంగళవారం ఉదయమే వ్యవసాయ శాఖ అధికారులు... రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేశారు. రైతు బంధు నిధులు తమ అకౌంట్లలో పడినట్లు ఎకరా లోపు భూమి ఉన్న రైతులకు మెసెజ్ లు కూడా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతు బంధు సాయం కింద  మొత్తం 68.10 లక్షల మంది రైతులకు సంబంధించిన మొత్తం కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకుకేసీఆర్ సర్కార్ పెట్టుబడి సాయం అందించనుంది. ఎకరాకి ఐదు వేల చొప్పున ఏడాదిలో రెండు సార్లు ఈ సాయం అందుతుంది. వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పుడు నిధులు అందిస్తుంది. రైతు బంధు కోసం ప్రభుత్వం ఈ దఫా  7 వేల కోట్ల 521 లక్షల 80 వేల రూపాయలు కేటాయించింది. రోజూ ఒక ఎకరా నుంచి ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాగా.. బుధవారం రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి మనీ ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఇక మొదటిసారి రైతు బంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను కలిసి పట్టాపాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


Read also: TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. విద్యార్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.