Omicron Scare: తెలంగాణలో కరోనా ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు ఆందోళకరంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే (Omicron new cases in Telangana) 12 కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కు (Total Omicron cases in TS) పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తకేసుల్లో 10 మంది విదేశాల నుంచి వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఒమిక్రాన్ బాధితుల ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 మంది ఒమిక్రాన్​ను జయించారు.


దేశవ్యాప్తంగా ఆందోళనలు..


దేశవ్యాప్తంగా కూడా కొవిడ్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 156 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఒక్క రోజులోనే ఈ రాష్ట్రంలో 26 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఇక ఉత్తరాఖండ్​లో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు పెరిగాయి.


ఒమిక్రాన్​ ఆందోళన నేపథ్యంలో మళ్లీ నైట్​ కర్ఫ్యూ


ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు నియంత్రణ చర్యలకు దిగాయి. కేరళలో గురువారం నుంచి ఆదివారం వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్​లో సైతం రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Also read: Rythu Bandhu: రైతులకు గుడ్​ న్యూస్​- రేపటి నుంచే ఖాతాల్లో రైతు బంధు జమ


Also read: Omicron Scare: తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు- న్యూ ఇయర్ వేడుకలు బంద్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook