Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గింది. రాష్ట్రంలో తాజాగా 1,963 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శనివారం వెల్లడించింది. మొత్తం 53,073 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య కూడా భారీగా తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,05,199కు (Totala Corona cases in Telangana) చేరింది.


శుక్రవారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.


రాష్ట్రంలో కరోనా మృతులు..


కొవిడ్​ కారణంగా తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,054కు చేరినట్లు (Corona deaths in Telangana) ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.


ఇక గడిచిన 24 గంటల్లో 1,620 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,81,091 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.31 శాతానికి తగ్గింది.


తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 22,017 యాక్టివ్​ కొవిడ్ (Acitve Corona Cases in Telangana) కేసులు ఉన్నాయి.


రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,05,73,637 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,21,430 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 7,696 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.


Also read: Sankranthi Effect: నిత్యం శ్రమించే ఆ నగరం ఇప్పుడు విశ్రమిస్తోంది, ఎందుకో తెలుసా


Also read: Telangana : ఇకపై పదవ తరగతి పరీక్షలు 12 ఏళ్లకే రాయవచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook