Telangana COVID-19 Positive Cases: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు తగ్గకపోగా, రెట్టింపు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 10,122 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,01,783కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 99,638 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 10 వేల 1 వంద 22  మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 11 వేల నూట ఇరవై రెండుకు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో కొత్తగా 52 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,094కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా దాదాపు లక్ష కరోనా శాంపిల్స్‌కు పరీక్షలు చేస్తోంది.


Also Read: MSR Passed Away: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ కన్నుమూత


రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 6,446 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,40,590 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 45 ఏళ్లు పైబడిన వారు అప్పటిలోగా టీకాలు తీసుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కోవిడ్19 నిబంధనలు(Covid-19) పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు, వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. 


Also Read: COVID-19 test కు రూ. 500 వసూలు చేసిన డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు


జీహెచ్ఎంసీలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులలో GHMC పరిధిలో 1,440 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ మహా నగర ప్రజలలో ఆందోళన నెలకొంది.  తెలంగాణలో ప్రస్తుతం 69 వేల 221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.26 కోట్ల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రతి 10 లక్షల మందిలో 3.4 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తాజా ప్రకటనలో తెలిపారు. 


Also Read: Gold Price In Hyderabad: గుడ్ న్యూస్.. మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook