Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గణణీయంగా పెరుగుతోంది. కొత్తగా 482 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తంగా 38,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,971కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 


కరోనా ధాటికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,031కి చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా బారి నుంచి నిన్న 212 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ఆ బులిటిన్ లో వెల్లడించింది. 


తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు


తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 423 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 23 మంది ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.  


రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కి చేరింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 37 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 13,272 మంది తెలంగాణకు వచ్చారు. 


Also Read: One Moto India Launch: రూ.250 కోట్లతో తెలంగాణలో బ్రిటీష్ ఈ-స్కూటర్ సంస్థ ప్లాంట్


Also Read: Telangana Lock down: తెలంగాణలో ఈ నెలాఖరు నుంచి లాక్​డౌన్​?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి