TRS MLA Koneru Konappa tested Covid-19: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ ( TRS ) కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఇంకా పలువురు చికిత్సపొందుతూనే ఉన్నారు. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప ( Koneru Konappa ) క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయనతోపాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయింది. Also read: Ap Capitals issue: సుప్రీంలో జగన్ సర్కార్‌కు షాక్


అయితే.. గత రెండు, మూడు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కోనప్ప దంపతులు బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా.. వారికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను క‌లిసిన వారంతా ఐసోలేషన్‌లో ఉంటూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఎమ్మెల్యే కోన‌ప్ప కోరారు.  Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు