Times Now ETG Survey: ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ సీట్లను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ జరిపిన సర్వే ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టనుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్, జనసేన-టీడీపీ పొత్తు నేపధ్యంలో టైమ్స్ నౌ జరిపిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుందని 24-25 ఎంపీ స్థానాల్ని క్లీన్‌స్వీప్ చేయవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని టైమ్స్ నౌ తెలిపింది.


రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ 9-11 సీట్లు గెల్చుకోగా బీజేపీ 2-23 సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 3-4 సీట్లలో విజయం సాధించవచ్చు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో 9 ఎంపీ స్థానాల్ని గెల్చుకోగా ఈసారి బలం పెంచుకుందని తెలుస్తోంది. ఈసారి 9-11 స్థానాలు గెల్చుకోవచ్చు. ఇక బీజేపీ గత ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెల్చుకోగా ఈసారి ఆ పార్టీ ప్రభావం తగ్గింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీజేపీ 2-3 ఎంపీ స్థానాలకు పరిమితం కానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు గెల్చుకోగా ఈసారి 3-4 స్థానాలతో స్వల్పంగా బలం పెంచుకుందని తెలుస్తోంది. 


Also read: Times Now Survey: మళ్లీ ఫ్యాన్‌దే హవా, ప్రభావం చూపని బాబు అరెస్ట్, జనసేన పొత్తు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook